పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి.. ఈ సినిమా ఈ నెల జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో ప్రభాస్ డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఆయనను రాముడి పాత్రలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. సినిమా డేట్ ఫిక్స్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి రిలీజ్ కోసం సన్నద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసి ముందుగా టీజర్ రిలీజ్ చేసారు. కానీ ఈ టీజర్ కు దారుణమైన ట్రోల్స్ రావడం తెలిసిందే..
మరి 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను అందరు అంత దారుణంగా తీసేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ భయపడ్డారు. ఈ ట్రోలింగ్ కు లొంగకుండా సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేసి ఉంటే ఇదే పరిస్థితి జరిగేది. కానీ ఆడియెన్స్ మాటలను దృష్టిలో పెట్టుకుని సినిమాను జూన్ 16కు వాయిదా వేసి మళ్ళీ విఎఫ్ఎక్స్ వర్క్ స్టార్ట్ చేసారు..
ఆ సమయంలో రిలీజ్ అయ్యి ఉంటే సంక్రాంతి వార్ లో ఆదిపురుష్ సినిమా కొట్టుకు పోయి ఉండేది. తెలుగు రాష్ట్రాల్లో అయితే కలెక్షన్స్ అందుకునేది కాదు.. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా నెగిటివ్ కామెంట్స్ కారణంగా దారుణంగా కష్టాలను చవిచూడాల్సి వచ్చేది. ఇక ఈ మధ్య ప్రమోషన్స్ తో సినిమాపై నెగిటివిటీని తగ్గించారు. ప్లాన్ ప్రకారం అంతా చేయడంతో ఇప్పుడు మంచి హైప్ నెలకొంది..
అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర కూడా ఇప్పుడు ఈ సినిమాకు మంచి పరిస్థితులు నెలకొన్నాయి.. సోలోగా ఇండియన్ బాక్సాఫీస్ మీద ఆదిపురుష్ దాడికి దిగుతుంది. అందుకే అప్పుడు ట్రోల్స్ రావడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది అనే చెప్పాలి.
ReplyForward
|