అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు. ఆమె లీడ్ రోల్ వేసిన ‘విమానం’ సినిమా ఇటీవల రిలీజై పాజిటివ్ టాక్ దక్కించుకుంది. సముద్రఖని దర్శకత్వంలో ఆయనే నటించిన ఈ చిత్రం థియేట్రికల్ లో ప్రదర్శన కొనసాగుతోంది. ఇందులో లీడ్ రోల్ పోషించింది అనసూయ. ఆమె వేశ్యగా నటించింది. బోల్డ్ మాటలతో కుర్రకారును ఆకర్షించింది. ‘వెయ్యి రూపాయలు ఇస్తే చాలు ఎవడైతే ఏంటి..?’ ఆంటూ ఆమె అన్న మాటలు బోల్ద్ హిట్ అయ్యాయి. రాహుల్ రామకృష్ణ, అనసూయ మధ్య సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.
సినిమాల్లోనే కాదు బయట కూడా బోల్డ్ గా కనిపిస్తుంది అనసూయ భరద్వాజ్. అసలే అందగత్తే.. అందునా సొగసరి ఆమెను చూసిన వారు అందం తట్టుకోలేక నోరెళ్ల బెడుతున్నారు. ఇక ఆమె ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పిక్స్, వీడియోస్ కు విపరీతమైన లైకులు, షేర్లు వస్తున్నాయి. సముద్ర తీరంలో కనిపించిన ఆమె బికినీ వేసుకొని అందాలను చూపిస్తూ అయస్కాంతంలా ఆకర్షించింది. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇటీవల పోస్ట్ చేసింది. సముద్రం తీరంలో ఒక డెక్ పై బికినీ వేసుకొని డిఫరెంట్ స్టిట్ పెట్టిన ఆమె బ్యాక్ గ్రౌండ్ లో ఏఆర్ రహెమాన్ సాంగ్ తో తెగ మురిపించింది.
ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే. ప్రస్తుతం వెండితెరపై చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉంది అనసూయ. పుష్ఫలో లీడ్ రోల్ చేసిన అనసూయ, పార్ట్ 2లో కూడా కనిపించబోతోంది. దీనికి తోడు ఇటీవల విడుదలైన ‘విమానం’ కూడా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందనే చెప్పక తప్పదు. దీంతో వెబ్ సిరీసుల్లో కూడా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా ఇద్దరు పిల్లలు ఉన్నా.. ఇప్పటికీ ఆమె అందం రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Click For Anasuya Lastest Video