ఏప్రిల్ 30 న సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని వార్నింగ్ ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి బెదిరించాడు ఓ అజ్ఞాత వ్యక్తి. రాఖీ భాయ్ గా తనని తాను పరిచయం చేసుకున్న సదరు వ్యక్తి మాది రాజస్థాన్ జోధ్ పూర్ అని పోలీసులకు చెప్పాడని సమాచారం. ఏప్రిల్ 30 న సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు ముంబై పోలీసులు.
రాజస్థాన్ కృష్ణ జింకల వేటలో సల్మాన్ ఖాన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. కృష్ణ జింకలను దేవతలుగా ఆరాధించే గ్యాంగ్ స్టర్ బిష్ణోయ్ గతంలోనే సల్మాన్ ను చంపుతామని వార్నింగ్ ఇచ్చాడు. అప్పటి నుండి సల్మాన్ ఖాన్ కు భద్రత కల్పిస్తూనే ఉన్నారు పోలీసులు. ఇక ఇటీవల ఇలాంటి ఫోన్ కాల్స్ చాలా వస్తుండటంతో సల్మాన్ ఖాన్ బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా కొన్నాడు.
సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర గట్టి భద్రతా చర్యలు చేపట్టారు ముంబై పోలీసులు. అలాగే సల్మాన్ ఆఫీస్ దగ్గర కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసారు. సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రం ఈనెల 21 న భారీ ఎత్తున విడుదల అవుతుండటంతోప్రమోషన్స్ చేస్తున్నాడు దాంతో ఆ కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరారు.