కోలీవుడ్లో ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా దూసుకెళుతోన్న హీరో ఇళయదళపతి విజయ్.భారీ బడ్జెట్, హయ్యస్ట్ రెమ్యూనరేషన్.. ఇలా ఏ కేటగిరీ చూసినా విజయ్ టాప్ ప్లేస్లోనే తన సత్తా చాటుతున్నాడు.విజయ్తో సినిమా కోసం కోలీవుడ్ నుంచే కాకుండా టాలీవుడ్ నుంచి సైతం నిర్మాతలు ఎగబడుతున్నారు. రీసెంట్గా వారసుడు సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టుకున్నాడు. అయితే ఇప్పుడు విజయ్ మరో తెలుగు దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్లుగా కోలీవుడ్, టాలీవుడ్లో టాక్ నడుస్తోంది.
టాలీవుడ్ లో బ్యాటు టు బ్యాకు రెండు హిట్లు ఇచ్చి ఫుల్ ఫామ్లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని. దీంతో మలినేనితో సినిమాలు చేసేందుకు పెద్ద హీరోలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి తో గోపీచంద్ మలినేని తదుపరి ప్రాజెక్ట్ ఉంటుందనేలా వార్తలు వైరల్ అయ్యాయి. చిరంజీవిని కలిసి కథ కూడా చెప్పినట్లుగా టాక్ వచ్చింది. అయితే ఇప్పటివరకు ఆయన తర్వాతి చిత్రానికి సంబంధించి ఎటువంటి ప్రకటనా రాలేదు. తాజాగా ఇళయ దళపతి విజయ్కి గోపీచంద్ ఒక కథ చెప్పినట్లుగా టాక్ బయటికి వచ్చింది.గోపీచంద్ మలినేని చెప్పిన కథ విని.. సింగిల్ సిట్టింగ్లోనే సినిమాకి ఓకే చెప్పారట విజయ్.ఒక బలమైన పాయింట్తో హై ఓల్టేజ్ అవుట్ అండ్ అవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉండనుందని అంటున్నారు.పూర్తి కథ రెడీ అయిన వెంటనే సెట్స్పైకి వెళదామని గోపీచంద్కి విజయ్ మాటిచ్చినట్లుగా సమాచారం.
విజయ్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ ‘లియో’ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగానే .. మరో మూవీకి మాట ఇచ్చారట.ఆ తర్వాత గోపిచంద్తో సినిమా ఉంటుందట. తెలుగులో మంచి హిట్ కొట్టాలని విజయ్ అనుకుంటున్నారట.. అందుకే గోపిచంద్కు ఛాన్స్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే విజయ్ ,గోపీచంద్ మలినేని కాంబో పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కానీ త్వరలో.. అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ నడుస్తోంది.