నాగ చైతన్యతో కలిసి ‘ఏ మాయ చేశావే’తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత నటన, అభినయంతో అందరి మనసులను ఆకట్టుకుంది. ఆ తర్వాత చాలా గ్లామర్ రోల్స్ లోనూ నటించి మెప్పించారు. మూస థోరణి సినిమాలకు స్వస్తి పిలికి పాన్ ఇండియా రేంజ్ లో లేడి ఓరియంటెడ్ చిత్రం ‘యశోద’ తీశారు. ఇది కూడా భారీగానే కలెక్షన్లను రాబట్టింది. ఆమె తీవ్ర అనారోగ్యం భారిన పడిన సమయంలోనే యశోద రావడం అందులో తను ఎలాంటి ఇబ్బంది పడలేదని ఆమె చెప్పడం ఆమె అభిమానులు, సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. యశోద తర్వాత ఆమె చేసిన చిత్రం ‘శాకుంతలం’.
‘శాకుంతలం’ ప్రీమియర్ షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో రిలీజైన మార్నింగ్ షో నుంచి కలెక్షన్లు భారీగా తగ్గాయి. రెండు, మూడు రోజులకు పుంజుకుంటుంది అనుకునే సమయంలోనే ‘విరూపాక్ష’, ‘విడుదల’ లాంటి సినిమాలు రావడంతో ఇక శాకుంతలం వైపు చూసే ప్రేక్షకులు లేకుండా పోయారు. ఓల్డ్ స్టోరీని న్యూగా చూపడంలో దర్శకుడు విఫలమయ్యాడన్న టాక్ ఉంది. దీనికి తోడు సమంత కూడా ముసలి మొహంతో కనిపించిందంటూ ప్రేక్షకులు ఆ సినిమా వైపు కనీసం దృష్టిపెట్టలేకపోయారు. ఈ కారణాలతో శాకుంతలం వీకెండ్ కలెక్షన్లు భారీగా తగ్గాయి.
గుణ టీమ్ వర్క్ బ్యానర్ లో ఈ మూవీని నీలిమ నిర్మించింది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాన భాగస్వామిగా వ్యవహరించారు. గుణ శేఖర్ దర్శకత్వం వహించగా, సంగీతాన్ని మణిశర్మ అందించారు. చిత్రంలో సమంత సరసన పాటు దేవ్ మోహన్ హీరోగా నటించారు. మోహన్ బాబు, సచిన్ ఖేడ్కర్, ప్రకాశ్ రాజ్, అనన్య నాగెళ్ల, గౌతమి తదితర తారాగణం ఉన్నారు.
నైజాం ఏరియాలో రూ. 4.50 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ. 1.20 కోట్లు, ఆంధ్రా రూ. 6.50 కోట్లు, రెండు తెలుగు రాష్ర్టాల్లో కలిపి దాదాపు రూ. 12 కోట్ల వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఇతర భాషల్లో రూ. 4 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 1.80 కోట్లుతో రూ. 18 కోట్ల బిజినెస్ మాత్రమే సాధించింది.