shankar గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న స్టార్ హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకరు.. ఈయన ప్రస్తుతం ఎంత బిజీగా ఉన్నాడో అందరికి తెలుసు.. ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మకమైన సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ వైడ్ గా పెరిగింది. ఈ సినిమా తర్వాత ఇక ఇప్పుడు శంకర్ వంటి అగ్ర డైరెక్టర్ తో ”గేమ్ ఛేంజర్” సినిమాను చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తి చేసుకుంది.. ఎస్ ఎస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”గేమ్ ఛేంజర్” పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.. అయితే శంకర్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది.. అంతేకాదు ఈ సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ ను ఇవ్వకపోవడంతో మెగా ఫ్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు.
ఇది పక్కన పెడితే ఈ సినిమా కోసం యంగ్ డైరెక్టర్ ను రంగంలోకి దించుతున్నారని వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలి అని దిల్ రాజు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు అని టాక్ వినిపిస్తుంది.
దీంట్లో భాగంగానే యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలనును రంగంలోకి దించినట్టు టాక్.. ఈ సినిమాలో కొంత పార్ట్ ను ఈయన డైరెక్ట్ చేయబోతున్నాడు అని ఈ మేరకు దిల్ రాజు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. యాక్షన్ సీన్ల షూట్ జులై 11 నుండి స్టార్ట్ అవుతుంది అని వరుసగా న్యూస్ లు వైరల్ అవుతున్నాయి. హిట్ తో సూపర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ప్రజెంట్ వెంకటేష్ తో సైంధవ్ మూవీ చేస్తున్నాడు.. ఇది ఎంత వరకు నిజమో చూడాలి..