Kavitha Warning :
భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు 24 గంటల సమయం ఇస్తున్నానని.. తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలి లేదా బహిరంగంగా క్షమాపణ చెప్పలని భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. నిరూపించకుంటే ఆయన ముక్కు నేలకు రాసి మరీ స్వారీ చెప్పాలని డిమాండ్ చేశారు.
‘ఎంపీగా ఉన్నప్పుడు రెండు కేంద్రీయ విద్యాలయాలు తెచ్చానని, నేను ఎంపీగా ఉన్నప్పుడే స్పైస్ బోర్డు సాధించుకున్నానని..’ అర్వింద్ చెబుతున్నారు. నాపై ఆరోపణలు చేసింది సరిపోక ఇప్పుడు నా భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన పేరు తీసుకురావాల్సిన అవసరం నీకెక్కడికి? అంటూ మండిపడ్డారు. తన తండ్రి, తన అన్న తాను రాజకీయాల్లో ఉన్నామని మమ్ములను విమర్శిస్తే తట్టుకుంటాం కానీ నా భర్త రాజకీయాల్లో లేడు.. ఆయనను అంటే ఎట్టి పరిస్థితుల్లో సహించం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ ఎంపీ స్థానానికి గతంలో ఎంపీగా పని చేశారు కల్వకుంట్ల కవిత. తర్వాత అదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు ధర్మపురి అరవింద్. నియోజకర్గంలో వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుందని రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో కవితపై విపరీతమైన ఆరోపణలు చేశారు అరవింద్. ఆ తర్వాత ఆ కేసు నుంచి ఆమె బయట పడడంతో ఆ ఆరోపణలను నిరూపించాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సవాల్ విసురుతుంది.
మీ బీజేపీ ప్రభుత్వమే తనుకు లిక్కర్ స్కాంకు ఎటువంటి సంబంధం లేదని క్లీన్ చీట్ ఇచ్చిందని గుర్తుంచుకోవాలని చెప్పింది. మరోసారి విమర్శించేప్పుడు నిజా నిజాలు తెలుసుకోవాలని హెచ్చరించింది. ఇప్పుడు ఎంపీగా ఉన్న నీవు మళ్లీ గెలుస్తావా? అని ప్రశ్నించారు.