కేరళ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించారు. సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగ ణంలో జరిగిన హీరో సురేష్ గోపి కుమార్తె భాగ్య వివాహానికి ఆయన హాజర య్యారు. ప్రధాని మోడీ కొత్తజంటను ఆశీర్వదించారు. నటులు ముమ్మట్టి ,మోహన్ లాల్ ,జయరాం ,కుష్బూ సహా పలువురు పాల్గొనగా వారితో ప్రధాని ముచ్చటించారు. దేశప్రదాని తన కుమార్తె వివాహానికి హాజరు కావడం తో నటుడు సురేష్ గోపి సంతోషం వ్యక్తం చేశారు. పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. నటుడి కుమార్తె విహాహం కు వచ్చిన పలువురు సినీ ప్రముఖులతో మోడీ ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు.