అమెరికా : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అమెరికాలోని అట్లాంటా నగరంలో స్థానిక ప్రవాసులు ఏకాదశ రుద్రాభిషేక హోమాన్నిఘనంగా నిర్వహించారు. ప్రవాసాంధ్రుడు అక్కినేని ఆనంద్ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ హోమంలో బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రవాస యువతుల శాస్త్రీయ నృత్యం ఆకట్టుకుంది.
అనంతరం విందు భోజనం ఏర్పాటు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అంద జేశా రు. ఈ వేడుకలో ప్రముఖ వైద్యులు డా. మంగరాజు వానపల్లి, డా. తులసి వానపల్లి, డా. కోగంటి దేవందర్ కుమార్, డా. నందినిరెడ్డి, డా. సుధారెడ్డి, దుద్దిళ్ల శ్రీనాథ్, లింగం షీలా, బొర్రా సుధాకర్, ముసునూరు సురేష్, కొసరాజు దిలీప్ తదితరులు పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా మన సాంప్రదాయాలను మాత్రం కోనసాగిస్తూ ఉంటారన్న దానికి ఇదే నిదర్శనం. దేశాల ఎల్లలు దాటి వెళ్లినప్పటికి మన భారతదేశ లోని ఆచాారాలను వారు మరువ కుండా ఎంతో చక్కగా సంక్రాంతి పండుగను జరుపుకోవడమే కాకుండా పండుగును పురష్కరించుకోని ఏకాదశ రుద్రాభిషేక హోమాన్ని కూడా నిర్వహించారు.