Lokesh Padayatra : నెల్లూరు జిల్లాలో లోకేశ్ పర్యటన విజయవంతం అయింది. లోకేష్ యువగళానికి అడవిలో కూడా 3వేల500 వాహనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రారెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో యువగళం పాదయాత్ర విజయవంతం అయిందన్నారు. యువగళానికి వస్తున్న స్పందన చూసి మంత్రి కాకాణి ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. లోకేష్ అన్ని వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకూ ముందుకు సాగిపోతున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి ఏనాడైనా ప్రజా సమస్యలపై సమావేశాలు పెట్టారా అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు.
Breaking News