RBI Governor : మే 19న ఆర్బీఐ రూ.2000 నోటును ఉపసంహరించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు 2వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే సదుపాయం కల్పించిన సంగతి తెల్సిందే. ఈక్రమంలోనే రూ. 500 నోట్లను సైతం ఆర్బీఐ రద్దు చేస్తుందని.. వెయ్యి రూపాయాల నోటును కొత్తగా ప్రవేశపెడుతుందగానే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
ఈక్రమంలోనే నోట్ల ఉపసంహరణ.. కొత్త నోట్ల ముద్రణపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేడు(జూన్ 8న) క్లారిటీ ఇచ్చారు. రూ. 500 నోట్ల ఉపసంహరించుకునే ఆలోచన ఆర్బీఐకి లేదని స్పష్టం చేశారు. అలాంటి వదంతులను ప్రజలకు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే వెయ్యి రూపాయాల కొత్త నోట్లను తిరిగి ప్రవేశపెట్టబోమని ఆయన వెల్లడించారు. అలాంటి ఆలోచన తమకు లేదని చెప్పారు.