Bhagwant Kesari నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ వయసులో కూడా వరుస సినిమాలతో కుర్ర హీరోలకు కూడా పోటీగా నిలుస్తున్నాడు.. అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్స్ అందుకున్న విషయం తెలిసిందే.. వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా నుండి ఇటీవలే బాలయ్య బర్త్ డే రోజు టైటిల్ అండ్ టీజర్ అనౌన్స్ చేసారు.
ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా నెక్స్ట్ లెవల్లో రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాతో దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ఇదిలా ఉండగా బాలయ్య మరో సినిమాను అంగీకరించాడని అది ఏకంగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనుందని టాక్ వినిపిస్తుంది. భగవంత్ కేసరి తర్వాత బాలయ్య నెక్స్ట్ తన సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్న విషయం విదితమే..
బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా ఇది తెరకెక్కుతుంది.. ఇక ఇది కూడా పూర్తి అయ్యాక ఈయన పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది.. మరి బాలకృష్ణ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ఎవరితో చేయబోతున్నాడు అంటే.. ప్రశాంత్ వర్మ అని టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది.. ప్రశాంత్ వర్మ ప్రజెంట్ హను మాన్ అనే పాన్ వరల్డ్ మూవీను చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత బాలయ్య, ప్రశాంత్ వర్మ కాంబోలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కనుందని ఇది ఇప్పటికే ఫైనల్ అయినట్టు సమాచారం.. బాలయ్యకు ఇప్పటికే కథ వినిపించగా అందుకు ఈయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.. బాబీ మూవీ ఫినిష్ అయితే నెక్స్ట్ పాన్ ఇండియా రేస్ లో బాలయ్య దిగబోతున్నాడు. ఇది నిజంగా ఫ్యాన్స్ కు పండగలాంటి న్యూస్ అనే చెప్పాలి.