Hanuman : మరోసారి సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నోటికి పని చెప్పాడు. ఆదిపురుష్ సినిమాపై సంచలన కామెంట్స్ చేసి కాంట్రవర్సీ క్రియేట్ చేసాడు.. ఈయన ఒకప్పుడు మంచి మంచి సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా రాణించాడు.. కానీ రాను రాను రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమాలు అట్టర్ ప్లాప్ అవుతూ వస్తుండడంతో ఈయనకు క్రేజ్ తగ్గింది.
దీంతో ఈయన సినిమాలు మానేసి అవసరం లేని విషయాల్లో తలదూర్చుతూ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. మరి ఈ మధ్య పవన్ కళ్యాణ్ మీద వరుస కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్న వర్మ తాజాగా నిన్న రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమాపై చేసిన కామెంట్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి..
ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్ నటించిన ఈ సినిమా నిన్న జూన్ 16న గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా నిన్న రిలీజ్ అయిన అన్ని చోట్ల మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ సమయంలో మేకర్స్ హనుమంతుడు కోసం ప్రతీ థియేటర్ లో ఒక సీట్ కేటాయించాలని అని థియేటర్ యాజమాన్యాలను రిక్వెస్ట్ చేయగా అందరు హనుమంతుడి కోసం ఒక సీటు కేటాయించారు..
మరి ఇదే విషయంలో వర్మ ఇప్పుడు కామెంట్స్ చేసాడు.. ఈయన మాట్లాడుతూ.. హనుమంతుడికి సీట్ కేటాయించడం అనేది ఒక స్టుపిడ్ పని.. ఒక రకంగా ఆయనను అవమానించడమే.. ఆయన కావాలంటే థియేటర్ మొత్తం ఎత్తుకెళ్తాడు.. అలాంటి బలవంతుడైన హనుమంతుడికి సీటును కేటాయించడం చెత్త పని అంటూ ఇదంతా పబ్లిసిటీ కోసం ఇలా చేసారని కంటెంట్ ఉంటే ఎవ్వడైనా చుస్తాడంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు..