Anasuya Bharadwaj : స్టార్ యాంకర్ గా అనసూయ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.. అయితే ఇప్పుడు యాంకర్ గా చెప్పడానికి లేదు.. ఎందుకంటే ఈ భామ యాంకరింగ్ మానేసింది.. యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి కేవలం సినిమాల మీదనే ఫోకస్ పెట్టి బిగ్ స్క్రీన్ మీద కూడా తన హవా కొనసాగించాలని అనసూయ తహతహ లాడుతుంది.
అందుకు తగ్గట్టుగానే ఈమెకు మంచి అవకాశాలు వరిస్తున్నాయి.. ఇదిలా ఉండగా ఈ భామ తరచు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది.. ఏదొక వార్తతో ఈమె నిత్యం హాట్ టాపిక్ అవుతుంది. ఈ అమ్మడిపై పాజిటివ్ కంటే నెగిటివ్ కామెంట్స్ నే ఎక్కువ వస్తున్నాయి.. మరి ఈ విషయంలోనే ఈ భామ తాజాగా మరోసారి స్పందించింది..
ఈ మేరకు ఈ భామ ఎమోషనల్ అయ్యింది.. ఒక వీడియోను షేర్ చేయగా.. అందులో ఇలా ఉంది.. విశ్వ వ్యాప్తంగా ఒకరి బాధలు, కష్టసుఖాలు పంచుకునేందుకే సోషల్ మాధ్యమాలు వచ్చాయి.. కాకపోతే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎవ్వరు వీటిని ఇందుకోసం ఉపయోగించడం లేదు.. నేను అయితే నా కష్టసుఖాలను పంచుకుంటా..
అయితే ఎదుటివారిపై మీరు చేసే వ్యాఖ్యలు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.. కాబట్టి ఎదుటి వారి పట్ల దయతో ఉండండి.. అయితే ఈ విషయాన్నీ నేను కష్టపడి నేర్చుకున్న.. ఈ వీడియో నేను బాధలో ఉండగా 5 రోజుల క్రితం తీసుకున్న వీడియో.. ఇప్పుడు బాగానే ఉన్నాను” అంటూ ఈమె ఏడుస్తున్న వీడియోను షేర్ చేసింది.
View this post on Instagram