Anupama Parmeswarn : ప్రేమమ్ సినిమాతో సినీ అరంగేట్రం చేసిన మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.. ఈమె మలయాళీ అయినప్పటికీ తెలుగు బ్యూటీ లానే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రేమమ్ తో మొదలైన ఈమె సినీ ప్రయాణం ఆ తర్వాత టాలీవుడ్ కు చేరుకుంది.. ఈ కేరళ కుట్టి త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అఆ’ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది..
ఈ సినిమాలో ఈ అమ్మడు తనదైన నటనతో ప్రేక్షకుల మదిలో నిలిచి పోయింది. ఆ తర్వాత ఈ భామ ఎంచుకుంటున్న సినిమాలన్నీ మంచి విజయం సాధిస్తూ ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలొ గురు ప్రేమకోసమే, రౌడీ బాయ్స్ వంటి సినిమాతో అలరించింది.
ఇక ఇటీవలే వచ్చిన కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. కార్తికేయ తర్వాత నిఖిల్, అనుపమ జోడీ 18 పేజెస్ సినిమాతో మరో బంపర్ హిట్ అందుకుంది.. ప్రజెంట్ ఈ భామ డీజే టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తుంది.. అలాగే ఈమె చేతిలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా కూడా యాక్టివ్ గా ఉంటూ నెట్టింట కాస్త అందాల డోస్ పెంచేసి పిక్స్ షేర్ చేస్తుంది. ఘాటైన ఫోజులతో కవ్విస్తున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. అంతేకాదు తాజాగా ఈ అమ్మడు దిగిన సెల్ఫీ పిక్స్ లో ఈమె ఎద పైన టాటూ వేసుకుని మరింత సెగలు పుట్టిస్తుంది. ఈ పిక్స్ చూసిన ఫ్యాన్స్ కూడా మెస్మరైజ్ అవుతున్నారు.