Anushka Shetty :
‘సూపర్’ మూవీతో టాలీవుడ్లోకి అనుష్క శెట్టి అడుగుపెట్టింది. కింగ్ నాగార్జునతో కలిసి ‘సూపర్’ లో రోమాన్స్ చేసింది. గ్లామర్ తోపాటు నటనాపరంగా ఈ భామ ‘సూపర్’ అనిపించుకోవడంతో అనుష్కకు ఆఫర్లు క్యూ కట్టాయి. స్టార్ డైరెక్టర్.. నిర్మాతలు ఆమెతో సినిమాలు చేసేందుకు తెగ ఆరాటపడటంతో వరుసగా స్టార్ హీరోల పక్కన నటించే ఛాన్స్ దక్కించుకుంది.
గ్లామర్ హీరోయిన్ గా అనుష్క శెట్టి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అరుంధతి’లో నటించింది. ఈ సినిమా టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అరుధంతిలో అనుష్క(జేజేమ్మ) నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో అనుష్కకు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలకు కేరాఫ్ గా మారింది. స్టార్ హీరోలకు దీటుగా ఆమె సినిమాలు వసూళ్లను రాబడుతున్నాయి.
టాలీవుడ్లోని ప్రతీ స్టార్ హీరోతో అనుష్క శెట్టి పాడింది. నాగార్జున-అనుష్క.. ప్రభాస్-అనుష్క.. గోపీచంద్-అనుష్క జోడికి టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. ‘బాహుబలి’ సినిమాతో అనుష్క వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ‘నిశబ్దం’ మూవీతో తర్వాత అనుష్క నుంచి సినిమాలు రాలేదు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క లీడ్ రోల్ చేసిన ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో అనుష్క శెట్టి కన్పించడం లేదు. నవీన్ పోలిశెట్టి మాత్రమే ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తుండటంతో అనుష్కకు ఏమైంది? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ‘సైజ్ జీరో’ సినిమాలో భాగంగా అనుష్క చాలా బరువు పెరగాల్సి వచ్చింది. అప్పటి నుంచి బరువు తగ్గేందుకు వర్కౌట్స్ చేస్తోంది. అయినప్పటికీ తన ఫిజిక్ లో పెద్దగా మార్పు రాలేదు. ఈ సినిమాలో కూడా అనుష్క బొద్దుగానే కన్పిస్తోంది. ఈ కారణంగానే అనుష్క మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదనే టాక్ వినిపిస్తోంది.