Chandrababu – Lokesh : చంద్రబాబు అరెస్ట్ కావడంతో వరుస కేసులతో బాబును జైల్లోనే ఉంచాలని వైసీపీ సర్కార్ కుట్రపన్నుతోంది. సీఎం జగన్ ఈ మేరకు దారుణ కుట్రలు పన్నుతున్నట్టుగా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ మేరకు వరుస కేసుల్లో చంద్రబాబును బుక్ చేయాలని చూస్తోంది. చంద్రబాబుకు తోడుగా నారా లోకేష్ ను కూడా జైలుకు పంపడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ మేరకు సంచలన స్టెప్ వేసింది.
తాజాగా ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసింది. ఈసారి ‘అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరో పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి నారాయణను, ఏ6గా నారా లోకేష్ ను పెట్టి కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు విడుదలైనా కూడా వదలకుండా వరుస కేసులతో చంద్రబాబును జైలుకు పంపాలని కుట్ర చేస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును విచారణ జరపడానికి కోర్టులో ఏపీ సీఐడీ పిటీషన్ వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలోనూ చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపాలని సీఐడీ కుట్ర చేస్తున్నట్టు సమాచారం.
2022లో చంద్రబాబు, మంత్రులపై కేసు బుక్ చేశారు. ఇప్పుడు ఆ పాత కేసును బయటకు తీసి ప్రయోగించి చంద్రబాబును జైల్లో ఉంచడానికి స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం.