Bhashyam Praveen : పెదకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కు గ్రామాల్లో జన నీరాజనం దక్కుతోంది. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలతోపాటు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి భాష్యం ప్రవీణ్ కు మద్దతు పలుకుతున్నారు.
ఈరోజు క్రోసూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జయహో బీసీ కార్యక్రమానికి భాష్యం ప్రవీణ్ హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బీసీలకు పెద్దపీట వేస్తుందని, బీసీ ల అభ్యున్నతి కోసం బీసీ డిక్లరేషన్ ప్రకటించిందనిపెదకూరపాడు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ గారు తెలిపారు.
అనంతరం క్రోసూరు మండలం గరికపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి వైసిపి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యమని తెలిపి కూటమి గెలుపు యొక్క ఆవశ్యకతను వివరించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రతీ గ్రామంలోనూ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కు జనాలు నీరాజనం పలుకుతున్నారు.
పెదకూరపాడులో ప్రవీణ్ జోరు చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి గెలుపు ఆయనేదనని.. ప్రత్యర్థి వైసీపీ చిత్తుగా ఓడడం ఖాయమని అర్థమవుతోంది. అంతలా నేతలంతా కలిసిపోయి.. ప్రజలంతా జైజైలు పలుకుతున్న పరిస్థితి నెలకొంది.