Miss India Beauty : శోభిత దూళిపాళ్ల తెలుగింటి అమ్మాయి.అంతే కాదు బ్రాహ్మణ కుటుంబలో పుట్టింది. ఆర్ట్స్ గ్రూప్ లో గ్రాడ్యుయేషన్ చదివింది.అక్కడితో ఆగలేదు. అందాల పోటీలో సత్తా చాటి పేరుతెచ్చుకోవాలని కళలు కన్నది.ఇంకేముందు అనుకున్నది సాదించింది.2013 లో మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొని తన అందాలకు తగ్గట్టుగా ద్వితీయ స్థానం కైవసం చేసుకోండి. ఆ తరువాత నిర్వహించిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీలో పాల్గొని తెలుగింటి అమ్మాయిగా సత్తా చాటింది.
2016 లో మొదటిసారిగా హిందీ సినిమాలో అవకాశం వచ్చింది.అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామం రాఘవ్ 2. లో స్మృతికా నాయుడు పాత్రను పోషించి తన నటనతో అభిమానులను సంపాదించుకొంది.
2021 లో ఏకంగా నాలుగు సినిమాల్లో నటించి తిరుగులేని నటిగా గుర్తింపు పొందింది. తెలుగు,తమిళం,మలయాళం,హిందీ భాషల్లో నటించి మెప్పించింది.తెలుగులో మహేష్ బాబు నిర్మాతగా తెరకెక్కించిన మేజర్ సినిమాలో అడవి శేషు సరసన నటించింది. అందులో ఆమె ప్రమోద పాత్రతో అభిమానులను ఆకట్టుకొంది.గ్లామర్ గ తన అందాలతో కుర్రకారును మత్తెకించే రీతిలో నటిస్తూ సినీ పరిశ్రమలో కొనసాగుతోంది. 2016 లో ఇండస్ట్రీ లో కాలుమోపిన శోభిత దూళిపాళ్ల ఇప్పటివరకు 13 సినిమాలతో జోరుసాగిస్తోంది.ఎనిమిది హిందీ,తెలుగు లో రెండు,మాలయంలో రెండు,ఇంగ్లీష్ లో ఒక సినిమాతో అనతికాలంలోనే తిరుగులేని నటిగా గుర్తింపు తెచ్చుకొంది.
ఇటీవల కాలంలో పలువురు తెలుగు హీరోయిన్స్ సినీ ఇండస్ట్రీ లో తమ కళానైపుణ్యంకు తిరుగులేదని రీతిలో సత్తా చాటుతున్నారు. కెమెరా ముందు మాట్లాడే హీరయిన్ లు అందాలతో సంబంధం లేకుండా,మొహమాటం లేకుండానే ఇప్పుడు బహిరంగానే మాట్లాడేస్తున్నారు. బహిరంగంగా మాట్లాడుతూ తామేమి తక్కువగా లేమంటున్నారు.ఈ నేపథ్యంలోనే అందాల ముద్దుగుమ్మ తెలుగింటి అమ్మాయి ప్రముఖ హీరోయిన్ ఆయిన శోభిత కూడా బహిరంగంగానే తన పెదవులకు పనిచెప్పింది. అందరికంటే తానేమి తక్కువా అన్నట్టు తన మనసులో దాగి ఉన్న విషయాన్నీ బహిరంగాన్నే ఒప్పేసుకొంది.
తెలుగులో తన అందాలను ఆరబోసి,యువతను మత్తెక్కిస్తూ నటనలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్న శోభిత దూళిపాళ్ల ఓ ఇంగ్లిష్ సినిమాలో శోభిత నటించి తన అభిమానులకు నమ్మలేని పాత్రలో నటించింది. వేశ్య పాత్రలో నటించి తన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ సినిమా ఏప్రిల్ 5 న విడుదల కావడంతో ఆమె అభిమానులు థియేటర్లకు పరుగులు పెట్టారు. ఆ సినిమాలో ఆమె ఒక్కసారిగా వేశ్య పాత్రలో కనిపించేసరికి షాక్ కు గురయ్యారు. భారత దేశంలో ఈ నెల 26 న విడుదల కానుంది.
సినిమా విడుదల ఆయిన సందర్బంగా శోభిత మాట్లాడుతూ మంకీ మ్యాన్ అనే ఇంగ్లీష్ సినిమాలో తాను నటించిన వేశ్య పాత్ర న అభిమానులకు ఇబ్బందిగా ఉండవచ్చు. కానీ ఆ పాత్ర చేయడంతో నాకు చాల గౌరవంగా అనిపించిందని స్పష్టం చేసింది.మంకీ మ్యాన్ సినిమాలో నేను నటించిన వేశ్య పాత్రకు తగిన గుర్తింపు రావడంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ సందర్బంగ ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.