అయితే ఈ సారి ఎన్నికలు మరింత కాస్ట్లీ కాబోతున్నాయి. తెలంగాణ, ఏపీల్లో అయితే ఇది మరింత ఎక్కువ అయ్యే చాన్స్ ఉంది. తెలంగాణలో హుజూరాబాద్, దుబ్బాక, హుజూర్ నగర్ ఎన్నికల్లోనే కోట్లాది రూపాయలు వెదజల్లారు. ఇక ఇప్పుడు అసలు ఎన్నికలు. చాలా పార్టీలకు చావో రేవో తేల్చుకునే సమయం. గతంలో కంటే ఎక్కువ చెమటోడ్చాల్సిందే. అధికార పార్టీ ఒకడుగు ముందున్నా, విపక్షాలు తమ స్థాయికి మించి పరిగెత్తాల్సిందే. అర్థ, అంగ బలం ఉన్న అధికార పార్టీలను ఢీ కొట్టాలంటే ఆ స్థాయిలో కత్తులు నూరాల్సిందే. కత్తులు ఎందుకు అనుకుంటున్నారా… ఆలోచనలకు పదును పెట్టడానికి. అవును అధికార పార్టీల వ్యూహాలను తట్టుకునేలా ఎత్తులు వేస్తేనే ప్రతిపక్షాలు దీటు జవాబు ఇవ్వగలవు. అందుకే ఇప్పటికే అస్ర్తాలను సిద్ధం చేసుకున్నాయి. అధికార పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ప్రతిపక్షాలకు ఉండదు. డేగ కళ్లతో నిఘా వాటిపై నిత్యం కొనసాగుతూనే ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి కూడా ఒక్కోసారి ప్రతిపక్ష పార్టీల నాయకులతకు ఎదురవుతుంది. గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు పలు కీలక నేతల పరిస్థితిని అలాగే చేశారు. రాష్ర్టం మొత్తం తిరగాలనుకున్నా, కనీసం వారి నియోజకవర్గం కూడా దాటకుండా చేసి కట్టడి చేశారు.
అయితే ఈ సారి ఎన్నికల్లో డబ్బుల ప్రవాహం వరదలై పారే అవకాశం ఉన్నది. గతంలో ఇచ్చిన వాటికే ఈసారి ధరల రెట్టింపయి మొత్తం గుంజారనే అభిప్రాయం ఉంది. ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన కొన్ని గ్రామాల్లో తమకు డబ్బులు ఇవ్వలేదనే స్థానిక ప్రజలు ఆందోళన చేసిన సందర్భాలను మనం చూశాం. మరి ఇప్పుడు పోటీ తీవ్రంగా ఉంది. ప్రతిపక్ష పార్టీలు రెండు తెలుగు రాష్ర్టాల్లో పుంజుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ బలంగా దూసుకొస్తున్నాయి. సర్వేలు ఎలా ఉన్నా ప్రజల మనస్సులో అదే ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ఓటుకు నోటు తప్పదు. అధికార పార్టీలు ఇప్పటికే పలు పథకాల ద్వారా ప్రజల జేబుల్లోకి పైసలు చేరవేస్తున్నాయి. మరి ప్రతిపక్షం అంతకుమించి ఏదో చేయాల్సిందే. అధికార పార్టీ కూడా ప్రజలకు ఇచ్చాం కదా అని కూర్చోవడానికి ఏం ఉండదు. ఎన్నికల ముందు రోజు చేయి తడిపినోడిదే ఇక్కడ నడుస్తుంది. పైసలు ఎవరిచ్చినా మాకే ఓటేయండి అని ప్రచారం చేసినా, జనం నాడిని నమ్మడానికి ఏం లేదు. ఈ రోజు గెలిచే అవకాశం ఉన్న నేత తెల్లారేసరికి లెక్కలు మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ సారి ఎన్నికలు కాస్ట్లీ కాబోతున్నాయి. ఇంటింటికీ అభ్యర్థి తన బలాన్ని చూపాల్సిందే. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో ఒక జోక్ ట్రోల్ అవుతున్నది. అదేంటంటే..
‘పోయినసారి ఓటుకు 3వేలు ఇచ్చాడు..
ఏట్లో ఇసుకంతా అమ్ముకుదొబ్బారూ…. వదినా
అవును వొదినా…..ఈసారి ఏకంగా కేజీ బంగారం ఇస్తారంట…
అంటే మన లివర్లు కిడ్నీ లు కాలేయం కూడా అమ్మేత్తాడేమో.. వదిన ..’..
ReplyForward
|