Delhi CM : లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ పోలీస్ ఆఫీసర్ పై కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈడి ఆఫీస్ నుంచి కోర్టుకు తీసుకువచ్చే క్రమంలో ఎసిపి ఏకేసింగ్ తనతో అనుచితంగా ప్రవర్తించారని, అతడిని తన సెక్యూరిటీ విధుల నుంచి తప్పించాలంటూ రౌస్ అవెన్యూ కోర్టు కు దరఖాస్తు అందజేశారు. కాగా గతంలో మనీష్ సిసోడియా ను మెడ పట్టుకొని తీసుకెళ్లిన పోలీస్ ఆఫీసర్ కూడా ఏకే సింగే కావడం విశేషం.
ఎందుకు ఈ పోలీస్ అధికారి వీరి పట్ల ఇలా వ్యవహరిస్తున్నాడు అన్న కోణంలో ఆప్ నేతలు చర్చించుకుంటున్నారు. ఎవరి ఆదేశాలతో ఏకే సింగ్ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అనుమానాలు వారిలో ఉన్నాయి.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పట్ల ఇతను వ్యవహరించిన తీరు అభ్యంతర కరంగా ఉంది. దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ పోలీసు అధికారిని తన సెక్యూరిటీ నుంచి తప్పించాలని కోరారు.