Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీ వాల్ ఈడి అధికారుల కస్టడీ నేటికీ ముగిసింది. దీంతో ఆయనను అధికారులు రౌస్ రెవెన్యూ కోర్టు లో హాజరుపరచ నున్నారు. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను మార్చ్ 21 న ఈడి అధికారులు అరెస్ట్ చేశారు. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా మార్చి 28 వరకు కస్టడీకి ఇచ్చింది.
మరోసారి ఆ కష్టడిని ఏప్రిల్ ఒకటి వరకు పొడిగిం చింది. అరెస్టును సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన కొటేషన్ పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 3 వ తేదీకి వాయిదా వేసింది.
ఢిల్లీ సీఎం బెయిల్ పిటిషన్ పై ఈరోజు కోర్టు లో తీర్పు రాబోతుంది. గత కొద్ది రోజుల నుంచి ఈ డి విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం జైలు నుంచి తన పరిపాలన కొనసాగిస్తున్నారు.
అనవసరంగా నన్ను ఈ కేసులో ఇరికించారని తనకు బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో పిటిషన్ వేశారు . నేడు విచారణ తర్వాత తీర్పు వెలవడనుంది