Smart Phones :
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మొబైల్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ల పైనే ఆధారపడి జీవిస్తున్నారు. సమయం దొరికిందంటే చాలు ఫోన్ తోనే గడుపుతుంటారు. అలా ఫోన్ మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.
తాజా నివేదిక ప్రకారం 86 శాతం స్మార్ట్ ఫోన్ల ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. కరెంట్ బిల్లులు వంటివి ఆన్ లైన్ లోనే కడుతున్నారు. 80 శాతం మంది ఆన్ లైన్ ద్వారానే షాపింగ్ చేస్తున్నారు. 81 శాతం మంది నిత్యావసర వస్తువులు ఆర్డర్ చేస్తున్నారు. 66 శాతం మంది ఆన్ లైన్ సేవలను బుక్ చేసుకుంటున్నారు. 72 శాతం మంది కిరాణా సరుకులు కొనుగోలు చేస్తున్నారు. 58 శాతం మంది డిజిటల్ నగదు చెల్లింపులు జరుపుతున్నారు.
స్మార్ట్ ఫోన్లు ఉపయోగించే వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఉండటం గమనార్హం. 82 శాతం మంది పురుషులు స్మార్ట్ ఫోన్లు వాడుతుండగా 38 శాతం మంది మహిళలు వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 41 శాతం మంది వాడుతున్నారు. పట్టణ ప్రాంతాల వారు 58 శాతం మంది ఉన్నారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది.
ఇలా రోజురోజుకు స్మార్ట్ ఫోన్ల వినియోగం రెట్టింపవుతోంది. దీని వల్ల నగదు చెల్లింపులు కూడా తగ్గుతున్నాయి. ఇంతకు ముందు జేబులో డబ్బులు లేనిదే ఎక్కడికైనా వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. చేతిలో డబ్బులు ఉన్నా లేకున్నా స్మార్ట్ ఫోన్లతోనే చెల్లింపులు చేయడం గమనార్హం. అందుకే పర్సు ఉండాల్సిన పనిలేదు. ఫోన్ ఉంటే చాలు. పనైపోతోంది.