పండ్లలో రారాజు మామిడి. దీన్ని చూడగానే తినాలని అనిపిస్తుంది. ఆకర్షణీయంగా ఉండటంతో వీటిని తినడం కోసం ఎంతో ఉత్సాహం చూపుతారు. వేసవి కాలంలో మాత్రమే లభించే ఈ పండ్లలో పోషకాలు మెండు. దీంతో ఈ సీజన్ లో పండ్లు విరివిగా తింటుంటారు. కానీ వీటిని తింటే వేడి కలుగుతుందని అనుకుంటారు. ఇది నిజంగా అపోహ మాత్రమే. మామిడిపండ్లు తింటే వేడి చేస్తుందని అనుకోవద్దు. కావాలినన్ని పండ్లు తింటే ఆరోగ్యం బాగుంటుంది.
మామిడి పండ్లను రెండు గంటల ముందు నీళ్లలో నానబెట్టి తరువాత కోసుకుని తింటారు. ఏ పండును కూడా నానబెట్టి తినరు. కానీ ఒక మామిడి పండును మాత్రం నీటిలో నానబెట్టి తినడంలో ఆంతర్యమేమిటో ఎవరికి అర్థం కాదు. కానీ ఇందులో ఉండే సమస్యల వల్ల వీటిని రెండు గంటలు నీటిలో నానబెడతారు. దీని వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి.
మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల వాటిలోని హీట్ కోర్ తగ్గుతుంది. మలబద్ధకం, చర్మ సమస్యలు, తలనొప్పి వంటి ఇబ్బందులు రాకుండా చేస్తుంది. ఇలాంటి ప్రభావాలు రాకుండా చేయడానికే నీళ్లలో నానబెడతారు. ఇలా చేయడం వల్ల అందులో ఉండే ఫైటిక్ యాసిడ్లు దూరం అవుతాయి. అధిక వేడి మన జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అందుకే వీటిని నీళ్లలో నానబెడతారు.
మామిడి తొక్కలో ఉండే మురికి, రసాయనాలు, పురుగుమందులు వంటి వాటి నుంచి రక్షణ కలుగుతుంది. మామిడిలో అధిక ఉష్ణోగ్రత ఉంటుందని తెలుసు. అందుకే వాటిని నానబెట్టడం ద్వారా అందులో ఉండే థర్మోజెనిక్ అనే లక్షణాలు తగ్గి మనకు మేలు చేస్తాయి. అందుకే మామిడి పండ్లను నీటిలో నానబెట్టి తినే అలవాటు క్రమంగా పెరిగింది.