Foreigners Reciting Hymns : భారతీయ సంస్కృతికి ఎవరైనా ఫిదా కావాల్సిందే. మన కట్టు బొట్టు చూస్తే ఎవరికైనా చేతులెత్తి దండం పెట్టాలని అనిపిస్తుంది. కరోనా సమయంలో ఒకరిని విష్ చేసే సంస్కృతి (నమస్కారం) కూడా మనల్ని చూసే విదేశీయులు నేర్చుకున్నారంటే అతిశయోక్తి కాదు.
ప్రపంచానికి వేదాలను పరిచయం దేశం మనదే. ఆనర్గళంగా వేదాలను పఠిస్తూ పూజలు చేయడం భారత్ లోనే చూస్తుంటాం. కాగా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్న భారతీయులు ప్రపంచంలోని అన్ని దేశాల్లో స్థిరపడిపోయారు. అక్కడ మన కట్టుబాట్లను మరిచిపోకుండా భారతీయతను చాటుతున్నారు.
అంతేకాకుండా విదేశీలయులకు మన సంస్కృతిని అలవాటు చేస్తున్నారు. కొంతమంది విదేశీయులు భారతీయకు ఫిదా అవడమే కాకుండా వేదాలను సైతం నేర్చుకుంటున్నారు. తెల్లొళ్లు మన వేదాలను పఠిస్తూ పూజలు చేస్తే ఆ కిక్కే వేరు కదా..! ఇందుకు సంబంధించిన వీడియో మీకోసం.. !