కొన్ని ఆహార పదార్థాలు రాత్రంతా నానబెట్టి తినడం వల్ల పోషక విలువలు అందుతాయి. వీటిని నీటిలో నానబెట్టి ఉదయం పరగడుపున తింటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. కాయ ధాన్యాలు నీటిలో నానబెట్టడం వల్ల ఫైటేట్ అని పిలిచే ఫైటిక్ ఆమ్లం తగ్గుతుంది. ఫైటిక్ ఆమ్లాన్ని యాంటీ న్యూట్రియంట్ అని పిలుస్తారు. దీనివల్ల ఇనుము, జింక్, కాల్షియం వంటి ప్రొటీన్లు లబిస్తాయి.
మెంతులు నీటిలో నానబెట్టి తినడం వల్ల పీచు అధికంగా లభిస్తుంది. నానిన తరువాత సులభంగా జీర్ణం అవుతాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అవిసె గింజలు, బాదం పలుకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో టానిఫ్ అనే సమ్మేళనం ఉంటుంది. వీటిని నానబెట్టి తినండి. నానబెట్టిన తరువాత తినడం వల్ల ఫైబర్ న్యూట్రిషియన్స్ పెరుగుతాయి.
మామిడి పండ్లను నీటిలో నానబెట్టి తినడం వల్ల వేడి తగ్గుతుంది. వీటిని తినడం వల్ల దద్దుర్లు, స్కిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అందుకే వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల పలు సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఎండు ద్రాక్షను కూడా నీటిలో నానబెట్టుకుని తింటే ఇనుము పరిమాణం పెరుగుతుంది. ఇందులో ఫైబర్ మలబద్ధకం లేకుండా చేస్తుంది.
ఇలా మనం తీసుకునే ఆహారాలను నీటిలో నానబెడితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో శనగలు, వేరుశనగలు కూడా నానబెట్టుకోవచ్చు. దీని వల్ల అందులో ఉంటే పోషకాలు మన సొంతం అవుతాయి. వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు నశిస్తాయి. అందుకే నానబెడితే ఎలాంటి నష్టాలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.