CM Revanth : కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ వేదికగా మేనిఫెస్టో విడుదల చేసింది. తెలంగాణ మాదిరి ఫలితాలు సాధించాలని భావిస్తోంది. దీని కోసమే ఇక్కడ నుంచి ఎన్నికల శంఖారావం పూరించింది. ఇండియా కూటమి పేరుతో జట్టు కట్టినా అందులో తగినన్ని పార్టీలు కలవడం లేదు. దీంతో వారి ఆశలు అడియాశలే అంటున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని తంత్రాలు పన్నినా చివరకు విజయం ఎన్డీయేదే అవుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
పదేళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడతామని కాంగ్రెస్ చెబుతున్నా అదంత సులభం కాదు. మోదీ చరిష్మా ముందు వారి ఆశలు పనిచేయవు. పదేళ్ల పాలనలో తెలంగాణను కేసీఆర్ నాశనం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామని చెప్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోవడానికి జానారెడ్డిని కాదు రేవంత్ రెడ్డిని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఎలా పడితే అలా మాట్లాడితే మాకు కూడా నోరుంది. మేం కూడా బూతులు మాట్లాడతాం. మా వంద రోజుల పాలన నచ్చడంతో రాష్ట్రంలో 14 లోక్ సభ స్థానాలు గెలుస్తామనే ధీమాతో ఉన్నాం. కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
గతంలో కూడా తుక్కుగూడ వేదికగానే ఆరు గ్యారంటీల హామీ ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ నుంచే యావత్ దేశం కోసం మేనిఫెస్టో ప్రకటించాం. ఇదే సెంటిమెంట్ తో విజయం సాధిస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు కోసం కట్టుబడి ఉన్నాం. గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం, విద్యుత్ సంక్షోభాన్ని మిగిల్చింది. దీంతోనే రాష్ట్రం దివాళా తీసింది. ఇప్పుడు మేం దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నాం.
ఈనేపథ్యంలో తుక్కుగూడలో మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ దేశంలో అధికారం హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది. దీని కోసం సర్వ శక్తులు ఒడ్డుతోంది. కానీ వారి కోరికలు తీరే మార్గాలు కనిపించడం లేదని చెబుతున్నారు. వారు ఎన్ని మేనిఫెస్టోలు విడుదల చేసినా కాంగ్రెస్ కు ప్రతిపక్ష పాత్రే మిగులుతుందని అంటున్నారు.