మనిషికి తిండితోపాటు నిద్ర కూడా అవసరం. ప్రతి జంతువు కూడా తిండి, నిద్ర సరిపోయే విధంగా చూసుకుంటాయి. అందుకే అవి ఆరోగ్యంగా ఉంటాయి. మనమే క్రమశిక్షణ లేకుండా ఏది పడితే అది తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. మన దేహాన్ని సరిగా ఉంచుకుంటే నూట యాభై ఏళ్లు జీవించొచ్చు అంటారు. కానీ మనం పాతికేళ్లకే అన్ని జబ్బులు తెచ్చుకుని హలో లక్ష్మణా అంటూ కాలం వెళ్లదీస్తున్నాం. ఈ నేపథ్యంలో మనిషికి మంచి నిద్ర పట్టాలంటే ఏం చేయాలో తెలుసుకుని పాటిస్తే నిద్ర కూడా మన సొంతం అవుతుంది.
చాలా మంది చెబుతుంటారు రోజుకు రెండుసార్లు స్నానం చేయాలని. కానీ ఎంత మంది పాటిస్తున్నారు. కాలమేదైనా శుభ్రత కోసం రోజుకు కనీసం రెండు సార్లు స్నానం చేస్తే మన మీద ఉన్న మురికి పోతుందని చెబుతుంటారు. కానీ ఎంత మంది రెండు సార్లు స్నాం చేస్తున్నారు. ఒక్కసారి చేయడమే గగనం. ఇక రెండో సారి అంటే కష్టమే. ఎందుకంటే బద్ధకం బాగా పెరిగిపోయింది. అందరు సుఖానికి అలవాటు పడ్డారు.
రెండు సార్లు స్నానం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శరీరంపై పేరుకుపోయిన జిడ్డు లేకుండా పోతుంది. చెడు బ్యాక్టీరియా మన శరీరంపై ఉండకుండా పోతుంది. అందుకే రోజుకు రెండు సార్లు స్నానం చేయాలని వైద్యులు సెలవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం సమయంలో ఒకసారి పడుకునే ముందు మరోసారి స్నానం చేయడం మంచిదేనని చెబుతున్నారు.
తలలో పేరుకుపోయిన చుండ్రు కూడా తొలగిపోతుంది. చన్నీళ్లు అయినా ఫర్వాలేదు గోరువెచ్చని నీళ్లు అయినా చాలు స్నానం మాత్రం చేయాలి. దీంతో శరీరం పరిశుభ్రంగా మారి మంచి నిద్ర పట్టేందుకు దోహదం చేస్తుంది. ఈ విషయం తెలియని చాలా మంది విధులకు వెళ్లొచ్చి అలాగే పడుకుంటారు. కానీ స్నానం చేస్తేనే మంచి నిద్ర మన సొంతమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.