Nara Lokesh : జగన్ గొడ్డలితో తెగబడితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేట కొడవళ్ళతో జనా లని వెంటాడుతున్నారని టిడిపి నేత నారా లోకేష్ ఆరోపించారు. సత్య సాయి జిల్లా కుటాలపల్లిలో టిడిపి కార్యకర్త అమర్నాథరెడ్డి హత్యకు గురయ్యాడు.
తీవ్రంగా ఖండిస్తున్నానని నారా లోకేష్ అన్నారు. ఇది ముమ్మాటికి వైసిపి సైకోల పనేనని లోకేష్ ఆరోపించారు. ఓటమి భయంతో మా కార్యకర్తలని అంతమందిస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. వైసి పి కాలకేయులకు ఇదే నా హెచ్చరిక అని మిమ్మల్ని ఎవరూ కాపాడలేడని లోకేష్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం నాయకుడు హత్య జరగడంతో నారా లోకేష్ మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి రాలేమన్న భయంతో తెలుగుదేశం పార్టీ నేతలను కార్యక ర్తలను ఇబ్బంది పెట్టి ఎలాగైనా నెగ్గాలని చూస్తున్నారని లోకేష్ ఆరోపించారు. ఎవరిని కుట్రలు చేసినా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని లోకేష్ తెలిపారు.