Yatra 2 First Look :
యాత్ర సినిమా తెలుగు ప్రజలను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఆడియెన్స్ నుండి ఈ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. మహి వీ రాఘవ్ తీసిన యాత్ర సినిమా ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు యాత్ర 2 తెరకెక్కింది.. ఈ సినిమాలో మొదటి పార్ట్ లో మమ్ముట్టి పాత్రను డైరెక్టర్ తీర్చి దిద్దిన తీరు ఆడియెన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించాడు అనే కంటే జీవించాడు అనే చెప్పాలి.. ఈ సినిమాలో ఈయన నటన బాగా ఆకట్టుకోవడంతో సినిమా మంచి విజయం సాధించింది. అప్పుడు యాత్ర సినిమాలో వైఎస్సార్ పాదయాత్ర ఉంటే ఇప్పుడు సెకండ్ పార్ట్ లో వైఎస్ జగన్ పాదయాత్ర మెయిన్ హైలెట్ గా నిలవబోతుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ ఇంటెన్స్ లుక్ లో ఆకట్టుకునేలా ఉంది. ఈ యాత్ర 2 సినిమాను వీ సెల్యులాయిడ్, త్రీ ఆటమ్ లీవ్స్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తుండగా ఫస్ట్ లుక్ కొద్దిసేపటి క్రితం వచ్చింది. మరి ఈ ఫస్ట్ లో రాజశేఖర్ రెడ్డి, జగన్ పాత్రలకు సంబంధించిన పోస్టర్ ను రివీల్ చేసారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటిస్తుండగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా కనిపిస్తున్నాడు. ‘నేనెవరో ప్రపంచానికి తెలియకపోవచ్చు.. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని’ అనే ఎమోషనల్ డైలాగ్ కూడా ఉంది.. ఈ పోస్టర్ నెట్టింట బాగానే వైరల్ అయ్యింది.
2009 నుండి 2019 వరకు ఏపీ రాజకీయాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ యాత్ర 2 తెరకెక్కగా ఫిబ్రవరి 8, 2024న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.
ReplyForward
|