Manchu Vishnu : మొన్నటి వరకు టాలీవుడ్ లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి.. ఈ పోరులో దిల్ రాజు ప్యానెల్ సి కళ్యాణ్ ప్యానెల్ మీద గెలిచారు.. దీంతో ఈసారి దిల్ రాజు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. జులై 30న ఈ ఎన్నికలు జరుగగా దిల్ రాజు విజయంతో ఈ పోరు ముగిసింది..
ఇక ఇప్పుడు అందరి చూపు మా అధ్యక్ష ఎలెక్షన్స్ మీద ఉంది.. ప్రస్తుతం మా అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఉన్న విషయం తెలిసిందే.. మరి ఈయన తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారట.. ఈ నిర్ణయం విని అంతా షాక్ అవుతున్నారు.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ప్రభావం మా ఎన్నికల మీద పడినట్టు సమాచారం..
2021 అక్టోబర్ లో మా ఎలక్షన్స్ జరుగగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మీద మంచు విష్ణు విజయం సాధించారు.. ఇప్పటి వరకు మా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. మరి తాజాగా సర్వసభ సమావేశం జరుగగా ఆ సమావేశంలో విష్ణు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. 2023లో సెప్టెంబర్ లో మళ్ళీ మా ఎలక్షన్స్ జరగాల్సి ఉంది..
కానీ ఈ ఎన్నికలను 2024 మే నెలలో నిర్వహించాలని తీర్మానించారట.. అందుకు అసోసియేషన్ అడిట్ సమస్యలే కారణం అని టాక్.. ఇక విష్ణు మరోసారి మా ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.. ఈయన ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని పూర్తి చేసి వచ్చే ఎన్నికల్లో పక్కకు తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారట.. దీంతో అంతా షాక్ అవుతున్నారు.