Puri Jagannadh : పూరి జగన్నాథ్ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన భార్య లావణ్య గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘‘నేను సినిమా తీసేటప్పుడు షూటింగ్ చూడడానికి వచ్చింది. అప్పుడు ఆ సమయంలో చూసి బాగా నచ్చి.. రెండు గంటల సేపు తననే చూశాను. నాకు పెళ్లాంగా సరిపోతుందని ఫీల్ అయ్యాను. తను నన్ను చూడడం లేదు. షూటింగ్ చూస్తుంది’’ అని చెప్పుకొచ్చాడు.
గోస్ట్ డైరెక్టర్ గా ‘‘అసలు అక్కడ నేను గోస్ట్ డైరెక్టర్ గా చేస్తున్నా.. ఎవరిదో సినిమా నాకు వెయ్యి రూపాయలు ఇస్తారంటే చేస్తున్నా.. అప్పుడు తన దగ్గరకు వెళ్లాను. నా వద్ద విజిటింగ్ కార్డు ఒకటే ఉండేది. అది ఇచ్చి.. నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఫోన్ చేయ్.. లేకపోతే వద్దు అని చెప్పి ఇచ్చివచ్చాను. తర్వాత ఓ వన్ వీక్ తర్వాత కాల్ చేసింది. ఎంత మందికి ఇచ్చావ్.. నీకు ఇదే అలవాటా..ఎంతమందికి ఇచ్చావ్.. అంటూ క్వశ్చన్ చేసింది’’ అని వెల్లడించారు.
‘‘ఇక అప్పుడప్పుడు కలువడం..భోజనానికి వెళ్లడం..ఇలా జరిగేది. అయితే అప్పుడు నాకు స్ట్రగులింగ్ టైం. ఆ అమ్మాయి వస్తుందంటే.. ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకునేవాడిని. ఒకసారి ఏదో హోటల్ కు వెళ్లాం. అసలే నాకు పైసలకు టైట్. ఓ మీడియం రేంజ్ హోటల్ కు వెళ్లాం. కూర్చున్నాక ..తందూరి చికెన్ ఆర్డర్ ఇచ్చింది. నేను లైఫ్ లో ఎప్పుడూ చికెన్ తినలేదు. ఐస్ క్రీమ్స్ కూడా తినేవాడిని కాదు. నేను కొద్ది తింటున్నట్లు యాక్ట్ చేస్తున్నా..తాను మాత్రం మొత్తం చికెన్ తినేసింది.. అది చూసి నేను షాక్ అయ్యా..’’ అని తెలిపారు.
‘‘ఇక తర్వాత బయటకు వచ్చి పెళ్లి మానేద్దాం అనుకున్నా.. అమ్మో ఈ పిల్లను నేను పెంచలేను అనుకున్నాను. ఇక తర్వాత తనకు చెప్పాను. ఇక నో మోర్ మీటింగ్స్.. పెళ్లైతే చెప్పు చేసుకుందాం.. అంటూ తనకు చెప్పేశాను. ఆ తర్వాత ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నాం. ’’ అంటూ చెప్పుకొచ్చారు.