Nag Makes Contestants Silent : వీకెండ్ అంటే బిగ్ బాస్ లవర్స్ మరింత ఇంట్రెస్ చూపిస్తుంటారు. అందుకు కారణం ఉంది.. బిగ్ బాస్ వీకెండ్ అంటే శనివారం, ఆదివారం ఎపిసోడ్స్ లో నాగార్జున ఎంట్రీ ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు కూడా మరింత ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి అనుకున్న విధంగానే నాగ్ నిన్న శనివారం ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా సాగుతూ తొమ్మిదవ వారంలోకి అడుగు పెట్టి అప్పుడే పూర్తి చేసుకునేందుకు కూడా రెడీ అయ్యింది. ఈ వారం చూస్తుండగానే వీకెండ్ కూడా వచ్చేస్తుంది. నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున వచ్చి పాయింట్ టు పాయింట్ కంటెస్టెంట్స్ ను నిలదీసాడు..
హౌస్ లో ఈ వారం జరిగిన గొడవలను ప్రస్తావిస్తూ అందరికి ఇచ్చిపడేసాడు.. ముందు కెప్టెన్ అయినందుకు శోభాను అభిమానందించాడు.. అలాగే శోభా కోసం ఆడిన అమర్ దీప్ ను కూడా అభినందించాడు. అంతేకాదు ఒక్కో కంటెస్టెంట్ కు వారి క్రెడిట్ ఇస్తూ బంగారం ఇచ్చాడు. శోభా, గౌతమ్ లకు బంగారం అందించాడు.
శివాజీ విషయంలో గౌతమ్ చేసిన కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చాడు. ఇక అశ్విని చెప్పుడు మాటలు విని ఎలా నిర్ణయం తీసుకుంటావ్ అంటూ నిలదీసాడు. ఎంతో ఆవేశానికి గురి అయినా గౌతమ్ అందరి ముందు ఫూల్ అయ్యాడు. భోలే తన ఆట సరిగ్గా ఆడలేదని బొగ్గు టాస్క్ ఇచ్చాడు.. యావర్ కూడా డల్ కావడం సరిగ్గా ఆడకపోవడం వల్ల ఆయనకు బొగ్గు ట్యాగ్ పడింది.
ప్రియాంకకు బంగారం ట్యాగ్ ఇచ్చాడు. ప్రశాంత్ కు బంగారం ట్యాగ్, అర్జున్, శివాజీలకు బంగారం ట్యాగ్ దక్కింది. రతికకు మట్టి ట్యాగ్ పడింది. శివాజీకి కొద్దిగా చూసుకోమని ఎలాంటి అపార్ధాలకు రావు ఇవ్వకుండా చూసుకోమని నాగ్ చెప్పాడు.. ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేది ఆదివారం ఎపిసోడ్ లో తేలనుంది.