భారతీయ కవి , సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అంటే తెలియని వారు ఉండరు..ఈయన వేదాంతుడు, ప్రవచనకారుడు కూడా… ఈయన చెప్పే మంచి మాటలు.. ప్రవచనాలు అందరికీ గుర్తుండిపోతాయి. సన్మార్గంలో నడిపిస్తాయి.. మనిషిని మనిషిగా ప్రబోధానుసారం నడిపించాలో ఈయన బోధనలు ప్రభావితం చేస్తాయి. ఇక జొన్నవిత్తుల మన మహానటుడు, ప్రముఖ రాజకీయ దురంధరుడు అయిన ఎన్టీఆర్ పై కూడా అభిమానం చాటుకున్నారు. ఆయన శతజయంతికి ప్రత్యేకంగా ఓ కవితను రూపొందించారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆ కవిత ఇప్పుడు వైరల్ అవుతోంది.
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తెలుగు సినిమాకి చేసిన సేవలకు ప్రసిద్ధి చెందారు. పాటల రచయిత తన కెరీర్లోని కొన్ని తెలియని , చమత్కారమైన కోణాలను ఆవిష్కరించారు. 1984లో తన కెరీర్ ప్రారంభించడానికి చెన్నైకి వెళ్లే ముందు చిన జీయర్ స్వామితో జరిగిన ఒక మనోహరమైన సంఘటనను జొన్నవిత్తుల అలీతో సరదాగా ప్రోగ్రాంలో పంచుకున్నారు. తనను నమ్మి ఒక సినిమాకి అన్ని పాటలు రాసే అవకాశం కల్పించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, వేటూరి, సిరివెన్నెల వైభవాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమాకు జొన్నవిత్తుల అందించిన సేవలు ఇప్పటికీ అందరి మదిలో ఉన్నాయి.
జొన్నవిత్తులకు ఇప్పటి వరకు ఎన్ని అవార్డులు వచ్చాయి. ఇంకా ఆయనకు రాని అవార్డులు లేవు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన అనేక భక్తి గీతాలు అనేక ప్లాట్ఫారమ్లలో ప్రదర్శితమయ్యాయి. వివిధ ఛానెల్లలో తరచుగా ప్రసారం చేయబడతాయి. అవార్డులు పొందడం కంటే ఇవి చాలా విలువైనదని ఆయన పేర్కొన్నాడు. విక్రమార్కుడు , పెళ్లి సందిడిలో అందించిన అతని పాటలలోని కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఇప్పటికీ శ్రోతల్లో మారుమోగుతూనే ఉంటాయి.
ఎన్టీఆర్ శయజయంతి సందర్భంగా జొన్నవిత్తుల ఎన్టీఆర్ పై రాసిన గీతం ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘వందఏళ్ల పండుగకు వందనాలు అందుకో.. నందమూరి తెలుగు తేజమా?’ అన్న పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సినీ గేయ రచయిత ఎన్టీఆర్ కు అర్పించిన ఈ పాట గేయ నివాళి అందరిలో స్ఫూర్తిని పంచుతోంది. జొన్నవిత్తుల గతంలో రాసిన ఈ పాటను ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు పాడారు. అది ఇప్పటికీ వైరల్ అవుతోంది.