AP Pensions : ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ కష్టాలు మొదలయ్యాయి. వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేయకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి పెన్షన్ పంపిణీ నిలిచిపోయింది. గ్రామ వార్డు సచివాలయాలు పెన్షన్లు పంపిణీ చేస్తారని అందరు కూడా అక్కడికి వెళ్లి పెన్షన్లు తీసుకో వాలని చెప్పడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
సచివాలయాల దగ్గర ఎండకు ఉండలేక అస్వస్థకు గురై ఇప్పటికే నలుగురు వృద్ధులు మృతి చెందా రు. గతంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసేవారు. అయితే వాలంటీర్లు పేషెంట్లను పంపిణీ చేయకూడదని కొందరు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ వారిని విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ కష్టాలు మొదలయ్యాయి.