BB7 Serial Batch Shocked : టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అంగరంగ వైభవంగా స్టార్ట్ అయ్యి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. ఇప్పటికే హౌస్ నుండి 7 వారాల్లో ఏడుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు.. ఇక ఇప్పుడు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆడియెన్స్ అంత ఎదురు చూస్తున్నారు.
8వ వారంలో మొత్తంగా 8 మంది నామినేట్ అయ్యారు. వారెవరంటే.. అమర్ దీప్, శివాజీ, ఆట సందీప్, గౌతమ్ కృష్ణ, భోలే, అశ్విని, శోభా శెట్టి, ప్రియాంక ఉన్నారు. చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారో.. ఇక వీకెండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. అప్పుడే నాగార్జున శనివారం ఎపిసోడ్ లో సందడి చేసాడు.
ఎప్పటిలాగానే నాగ్ వీకెండ్ ఎపిసోడ్ లో అందరికి ఓ రౌండ్ క్లాస్ తీసుకున్నారు. పిన్ టు పిన్ ప్రతీ విషయాన్నీ ప్రశ్నిస్తూ అందరిని ప్రశ్నించాడు. హౌస్ మేట్స్ లో అసలు స్వరూపాలను బయట పెట్టే ప్రయత్నం చేసారు.. ముఖ్యంగా శోభా, ప్రియాంక, అమర్ దీప్, యావర్, సందీప్ లను ఓ రేంజ్ లో ఆడుకున్నారు..
శివాజీ బయటకు వెళ్ళిపోతా అంటున్న కామెంట్స్ పై ఈసారి గట్టిగ నిలదీశారు. ఇక యావర్ విషయంలో శోభా శెట్టి పిచ్చోడా అంటూ చేసిన కామెంట్స్ పై నాగ్ సీరియస్ అయ్యాడు. నామినేషన్స్ ఫ్లోలో ఏదో వాగేశానని చెప్పింది.. భోలే నిన్ను అన్నప్పుడు సీరియస్ అయిన నువ్వు ఇప్పుడు యావర్ ను ఎలా అన్నావ్ అంటూ సీరియస్ అయ్యాడు.
అలాగే యావర్ పై కూడా ఫైర్ అయ్యాడు. హౌస్ ప్రాపర్టీ నాశనం చేయడం సరికాదని గట్టిగా చెప్పాడు. ప్రశాంత్ పై అమర్ అన్న మాటలను కూడా ప్రస్తావించాడు. ప్రశాంత్ ను నా కొడుకా అనడం, కుర్చీని తన్నడం పై ఫైర్ అయ్యాడు. అంతగా అరుస్తుంటే ప్రియాంక, శోభా కెప్టెన్ అర్జున్ ఏం చేస్తున్నారని శోభా విషయంలో మాట్లాడిన ప్రియాంక ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నవని ప్రశ్నించాడు.
రతికకు కూడా గట్టి క్లాస్ ఇచ్చాడు. బాగా ఆడతాఅని హౌస్ లోకి వచ్చి పాత విషయాలు ఎందుకు చర్చిస్తూ ముచ్చట్లు పెడుతున్నావ్ అంటూ క్లాస్ పీకాడు. ఇక సందీప్ మాస్టర్ వంతు రాగా బొంగులో డాన్స్, బొంగులో కొరియోగ్రఫీ అంటూ ప్రశాంత్ పై చేసిన కామెంట్లను ప్రశ్నించాడు. ఆ పదం ఎందుకు వాడావు అది తప్పు ఇలా చేయొద్దని తెలిపాడు.