Sidda Raghavarao : ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనబడుతుంది. వైశ్య సామాజికనికి చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవ రావు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమ వుతున్నారని తెలుస్తోంది.
దర్శి వైసీపీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర సంతృ ప్తికి గురైన ఆయన ఈనెల 27న తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు సమాచారం అందుతోంది. జిల్లా రాజకీయాలపై పట్టు ఉన్న ఆయనకు దర్శి టికెట్ ఇచ్చేందుకు తెలుగుదేశం హై కమాండ్ సానుకూలంగా ఉందని తెలుస్తోంది.
అటు వైసీపీ టికెట్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దక్కింది. దీంతో శిద్దా రాఘవరావు తీవ్ర సంతృప్తితో ఉన్నారు. కార్యకర్తలతో భేటీ అయిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం కనబడుతుంది.