Husband and wife పూర్వం రోజుల్లో భార్యాభర్తల బంధం బలపడాలంటే భర్త తిన్న కంచంలోనే భార్య తినాలనే నిబంధన ఉండేది. దీంతో వారు భర్త ఎప్పుడు తింటారో అని చూసి భర్త తిన్నాక అదే ప్లేటులో భోజనం చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కొత్త ట్రెండ్ వచ్చింది. ఎవరి కంచంలో వారే తింటున్నారు. పూర్వ కాలంలో ఉండే సంప్రదాయానికి ఇప్పుడు కొత్త తరహా విధానానికి శ్రీకారం చుడుతున్నారు.
భర్త తిన్న ప్లేటులో తినడం వల్ల అనేక రోగాలు వస్తాయనే సంగతి అప్పుడు తెలియదు. అందుకే వారు భర్త తిన్నాకే భోజనం చేసేవారు. అదే కంచంలో అన్నం పెట్టుకుని తినేవారు. దీంతో భార్యాభర్తల్లో మంచి సంబంధం ఏర్పడేదని చెబుతుంటారు. కానీ ప్రేమ అనేది అలా రాదు. భార్యను బాగా చూసుకుంటే వస్తుంది. ఒకవేళ భర్తకు ఏవైనా రోగాలు ఉంటే అవి భార్యకు అంటుకోవడం ఖాయం.
పాత్రలు, చేతులు శుభ్రంగా కడుక్కున్నాకే భోజనం చేయాలి. లేకపోతే బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించి మనకు రోగాలు రావడానికి కారణమవుతుంది. అందుకే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. భర్త తిన్న కంచంలో తినడం పాత కాలపు మాట. నేటి కాలం మహిళలు ఎవరు కూడా ఆ పని చేయడం లేదు. వారిలో కూడా చైతన్యం వచ్చింది.
భర్తకు జీర్ణ కోశ వ్యాధులు, అంటు వ్యాధులు ఉన్నా అంటుకుంటాయి. దీని వల్ల భార్య ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. భార్యాభర్తల అనుబంధానికి తిండికి సంబంధమే లేదు. ఏదో వారి సంప్రదాయాలు వారివి. మన సంప్రదాయాలు మనవి. అందుకే మనం భోజనం చేసే విషయంలో జాగ్రత్తలుతీసుకోకపోతే రోగాల బారిన పడటం ఖాయం.