Atchannaidu : వైసిపి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి పై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నేతల సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారని అచ్చంనాయుడు ఆరోపించారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్ లు పెట్టి ప్రతి పక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సజ్జలను ప్ర భుత్వ సలహాదారు పదవి నుంచి తొలగించాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టి రాజకీయంగా విమర్శలు చేయకూడదని అవేవీ పట్టించుకోకుండా వైసిపి ప్రభుత్వ సలహా దారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తన ఇష్టం వచ్చిన ట్లు వ్యవహరిస్తున్నారని అచ్చం నాయుడు ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ సజ్జలపై చర్యలు తీసుకోవాలని కోరారు.