CM Revanth : ఇచ్చిన హామీల మేరకు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 26 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని ఆయన తెలిపారు.
ఎనిమిది లక్షల కుటుంబాలు 500 సిలిండర్ అందుకున్నాయని ఆయన తెలిపారు. 42 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల విద్యుత్ పథకాన్ని పొందాయని సీఎం తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కెసిఆర్ నాశనం చేశారనీ ఆయన విమర్శించారు. వాహన రిజిస్ట్రేషన్ లో టిఆర్ఎస్ కు నకలు గానే టీఎస్ తీసుకొచ్చారని సీఎం ఆరోపించారు.
అందుకే మా ప్రభుత్వం వచ్చాక టీఎస్ ను టీజీ గా మార్చామని సీఎం తెలిపారు. ఇకమీదట వాహనా ల రిజిస్ట్రేషన్లు ఇతర కార్యకలాపాలన్నీ కూడా టీజీ పేరుతో జరుగుతాయని సీఎం తెలిపారు.