Dr.Jai Jagdish Yalamanchili : అమెరికాలో ఇండియా పరేడ్ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ వేడుకల్లో యూబ్లడ్ ఫౌండర్ డా.జగదీష్ బాబు యలమంచలి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ కూడా చేశారు. ఈయనతోపాటు జైస్వరాజ్య టీవీ డైరెక్టర్ శివకుమార్ చికినె గారు కూడా పాల్గొని భారత స్వాతంత్ర్య సంబరాలను ఇనుమడింప చేశారు.
ఒక సామాజిక సృహతో.. భారతదేశంలో అందరికీ ఉచితంగా రక్తదానం అందించాలన్న ధ్యేయంతో డాక్టర్ జగదీష్ గారు ఈ యూబ్లడ్ యాప్ ను రూపొందించారు. ఈ సందర్భంగా ఇండియా పరేడ్ వేడుకల్లోనూ వేదికపై మాట్లాడిన డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు తన యూబ్లడ్ యాప్ గురించి వివరించారు.
యూబ్లడ్ యాప్ రూపొందించడానికి తనను కదిలించిన ఘటనలను డాక్టర్ జగదీష్ గారు వివరించారు. 2010లో తన మామయ్య క్యాన్సర్ తో చనిపోయారని.. ఆయన కోట్లు సంపాదించారు.. మిలియన్లు సంపాదించారు.. తర్వాత ఏం చేయలేకపోయారన్న బాధ ఆయన్ను వెంటాడిందని.. తనను బాధించిందన్నారు.
ఇక యాపిల్ సీఈవో సైతం ప్రపంచంలోనే కోటీశ్వరుడు అని.. ట్రిలియన్ల ఆదాయం ఉందని.. అన్ని డబ్బులు ఉన్నా కూడా ఆయనను బతికించుకోలేకపోయాం.. ఇవన్నీ చూశాక తనకు ఎమోషనల్ గా అనిపించిందని.. నేను వెళ్లిపోతే నా తర్వాత ఏంటి? అని అనిపించిందని.. అందుకే ‘సేవే భావం.. సేవ లక్ష్యం’ అని సమాజానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నట్టు జగదీష్ గారు తెలిపారు.
సేవ ఎలా చేయాలని ఆలోచించి ‘యూబ్లడ్’ను స్థాపించానని.. రక్తదానం ఉచితంగా ఇవ్వాలని 9 ఏళ్ల క్రితం ఆలోచించి స్థాపించి అందరి ప్రాణాలను కాపాడుతున్నానని తెలిపారు. మీ రక్తదానం చేయండి.. మరొకరికి ప్రాణదానం అవుతుందని అందరూ రక్తదానం చేయాలని డా.జగదీష్ గారు పిలుపునిచ్చారు