Vijay Devarakonda :
విజయ్ దేవరకొండ-సమంత కాంబినేషన్లో ‘ఖుషీ’ మూవీ తెరకెక్కించింది. సెప్టెంబర్ 2న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడులైంది. ఈ మూవీ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. ఈ సినిమాలో రెండు పాటలు చాలా బాగున్నాయని వీటి కోసమైనా సినిమా చూడొచ్చని.. విజయ్ సమంత మధ్య కెమెస్ట్రీ పర్వాలేదనే పాజిటివ్ రివ్యూ బయటికి వచ్చింది.
కాగా కొంతమంది పనిగట్టుకొని తనను టార్గెట్ చేస్తూ నెగిటీవ్ రివ్యూ ఇస్తున్నారంటూ విజయ్ దేవరకొండ వైజాగ్ లో జరిగిన సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 10వేల ఫేక్ అకౌంట్లతో తన ‘ఖుషీ’ సినిమాకు నెగిటీవ్ ప్రచారం చేస్తున్నారని వాపోయాడు. దీంతో విజయ్ దేవరకొండ సినిమాపై కుట్ర చేస్తుందెవరనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.
అయితే వెట్ సైట్.. యూట్యూబ్ ఛానల్ ఇచ్చే రివ్యూలతో సినిమాలు ఆడవని.. సినిమాలో దమ్ముంటే నెగిటివ్ రివ్యూలు ఏమి చేయలేవని గతంలో ఎన్నో సినిమాలు నిరూపించాయి. దీనిని విజయ్ ఎందుకు గుర్తించడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. ఇటీవల విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయ్ దేవరకొండ నటించిన ‘బేబీ’ చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఈ సినిమాలో వైష్ణవి క్యారెక్టర్ పై సైతం మొదట్లో నెగిటివ్ టాక్ నడిచింది. అయితే కథాపరంగా అమ్మాయి పాత్ర జెన్యూన్ గా ఉండటంతో ప్రేక్షకులను సినిమాను బ్లాక్ బస్టర్ చేశారు. అదేవిధంగా పవన్ కల్యాణ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్-సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమాకు సోషల్ మీడియాలో మంచి రివ్యూలే వచ్చాయి. అయినప్పటికీ సినిమా పెద్దగా ఆడలేదు.
దీనిని బట్టి చూస్తే సినిమా కథ బాగుంటే రివ్యూలతో సంబంధం లేకుండా పబ్లిక్ టాక్ తో ప్రేక్షకులు విజయాన్ని అందిస్తారని అర్థమవుతోంది. అదేవిధంగా చెత్త సినిమాలను ఎంత బాగా ప్రమోట్ చేసినా.. ఎంత మంచి రివ్యూలు ఇచ్చినా నిర్ధాక్షిణ్యంగా ప్రేక్షకులు నిరాకరిస్తారని తేలింది. నిజంగా ‘ఖుషీ’ సినిమాలో దమ్ముంటే ఎవరూ ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా విజయ్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.