35.7 C
India
Thursday, June 1, 2023
More

    Deadline : రేవంత్ రెడ్డికి 48 గంటల డెడ్ లైన్.. ఇచ్చింది ఎవరంటే..!

    Date:

    deadline
    deadline, Revanth Reddy

    Deadline : తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కీలక నోటీసులు అందాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్ టెండర్ల అంశంపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు హెచ్ఎండీఏ ఈ నోటీసులు ఇచ్చింది. రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొంది. టెండర్లకు సంబంధించిన పూర్తి వివరాలు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపింది. నోటీసు అందిన 48 గంటల్లో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది

    అయితే కొంతకాలంగా ఓఆర్ఆర్ టెండర్ల అంశం వివాదాస్పదమవుతున్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ స్కాం అతి పెద్దదని రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ వస్తున్నారు. లక్షల కోట్ల ఆస్తిని రూ. 7 వేల కోట్లకు కట్టబెట్టారని విమర్శిస్తున్నారు. ఇదే అంశంపై హెచ్ఎండీఏ తీవ్రంగా స్పందించింది. రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొంది. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం సరికాదని తెలిపింది. హెచ్ఎండీఏకు ఐఆర్బి ఇన్ ఫ్రా కు మధ్య కుదిరిన ఒప్పందంపై వివరాలు తెలుసుకోకుండా , టెండర్ సారాంశాన్ని ధ్రువీకరించుకోకుండా ఆరోపణలు చేశారని పేర్కొంది. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడినట్లు భావిస్తున్నామని తెలిపింది. రాజకీయ మైలేజ్ పొందాలని ఏకైక లక్ష్యంతో ఈ ప్రకటన చేసినట్లు అర్థమవుతుందని స్పష్టం చేసింది. నోటీస్ అందుకున్న 48 గంటల్లో రేవంత్ రెడ్డి భేషరతు గా క్షమాపణ చెప్పాలని కోరింది.

    అయితే రేవంత్ రెడ్డి మాత్రం క్షమాపణ చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. టెండర్ ప్రక్రియలో ఉన్న అంశాలనే తాను ప్రస్తావించానని, వాస్తవాలను వక్రీకరించలేదని చెప్పుకొచ్చారు. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, న్యాయపోరాటానికైనా సిద్ధంగా ఉన్నానని చెబుతున్నారు. మరి ఈ  అంశం ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.

    Share post:

    More like this
    Related

    మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

      ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

    ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

      మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

    మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

    మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

    సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sharmila started : షర్మిల అందుకే తెలంగాణలో పార్టీ పెట్టిందా..?

    Sharmila started : ఆంధ్రప్రదేశ్ సీఎం ఇంటి గుట్టు ఒక్కొక్కటిగా బయటకు...

    kodangal గ్రౌండ్ రిపోర్ట్ : కొడంగల్ లో ఎవరి బలం ఎంత..?

    అసెంబ్లీ నియోజకవర్గం : కొడంగల్ బీఆర్ఎస్: పట్నం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ : రేవంత్...

    సీఎం పదవిపై ఆశలు కోల్పోయిన రేవంత్ రెడ్డి..?! కర్ణాటక ఫలితమేనా..?

    ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి...

    Revanth Sena : ఎన్నికలకు కరసత్తు చేస్తున్న రేవంత్ సేన..

    ఇప్పటికే డీసీసీల నియామకం పూర్తి తర్వాత వారే.. Revanth Sena :...