Revanth Reddy and Rahul gandhi
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయ కుడు రాహుల్ గాంధీకి ఎంతో అభిమానం. తెలంగా ణ రాష్ట్రంలో కెసిఆర్ ను ఎదిరించి నిలబడ్డ ఏకైక నాయకుడిగా రేవంత్ రెడ్డి నిలిచారు. ఈ క్రమంలోని రేవంత్ రెడ్డి తోనే తెలంగాణలో అధికారం సాధించగలం అన్న నమ్మకం రాహుల్ గాంధీకి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు గతంలో ఆదరించలేదు.
కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని మొన్నటి వరకు ప్రజలు నమ్మారు. అయితే తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చారని మనం ఆమెకు రుణపడి ఉండాలని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. కేసిఆర్ పాలనను అడుగడు గునా వ్యతిరే కిస్తూ సమస్యల పై పోరాడుతూ అనతి కాలంలోనే ప్రజలకు చేరువైన నేత రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి యొక్క తెగింపును చూసిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పిసిసి చీఫ్ గా నియమిం చింది . టిపిసిసి అధ్య క్షుడిగా నియమి తులైన రేవం త్ రెడ్డి అధికారమే లక్ష్యం గా తెలం గాణ రాష్ట్రంలో పనిచేశారు. అనుకున్న విధంగా రేవంత్ రెడ్డి సారధ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. తెలంగాణలో ఏ మీటింగ్ కు వెళ్లినా ఢిల్లీలో పర్యటించిన రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఎంతో ప్రాధాన్యత ఇస్తు న్నారు.