
దేశ వ్యాప్తంగా 74 వ జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆసేతు హిమాచలం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం చేసారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళ సై రాజ్ భవన్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కావడంతో ప్రతీ ఏడాది జనవరి 26 న రిపబ్లిక్ డే ఉత్సవాలను జరుపుకుంటామన్న సంగతి తెలిసిందే.