తెలంగాణలో కుటుంబ పాలన వల్ల అవినీతి పెరిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు మోడీ. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో ప్రాణాలనుద్దేశించి మాట్లాడారు. ఆ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు మోడీ.
కేసీఆర్ , కేటీఆర్ , కవిత ల పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు మోడీ. కాకపోతే తెలంగాణ లో పరిపాలన ఒక కుటుంబం చేతిలో ఉందని, అన్ని హక్కులు చేతిలో పెట్టుకొని అవినీతికి పాల్పడుతున్నారని , అలాంటి వాళ్లనుండి తెలంగాణను విముక్తి చేయాలని అందుకు అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలా ? వద్దా ? అంటూ ప్రజలను ప్రశ్నించారు. అంతేకాదు అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలా ? వద్దా ? అంటూ పదేపదే ప్రశ్నించారు. అలాగే వాళ్ళ నుండి తిరిగి సమాధానం రాబట్టారు మోడీ. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉందని అయితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ విమర్శించారు.
తెలంగాణలో 11355 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేశారు మోడీ. జాతీయ రహదారులను , రైల్వే లైన్ లను , కొత్తగా 13 ఎం ఎం టీఎస్ రైళ్లను ప్రారంభించడం , హైదరాబాద్ రింగ్ రోడ్డు తో పాటుగా తెలంగాణలో ఒక టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ భాగ్యలక్ష్మి టెంపుల్ ను ప్రస్తావించడం విశేషం.