: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో భేటీ కానున్నారు. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్లోని రాధాకృష్ణ నివాసానికి వెళ్లనున్నారు. మహా జనసంపర్క్ అభియాన్లో భాగంగా ఆయన రాధాకృష్ణతో సమావేశమవుతారు.ఇదే సమయంలో రామోజీరావును కూడా కలువనున్నారు. తొమ్మిదేళ్లలో బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని గ్రామాలకు చేర్చాలని అమిత్ షా రాధాకృష్ణను కోరనున్నట్లు తెలుస్తున్నది.
బీజేపీ స్పెషల్ టాస్క్..
కేంద్ర హోంమంత్రి, బీజేపీలో చాణక్యుడిగా పేరున్న అమిత్ షా టూర్ సెట్ అయ్యిందంటే దాని వెనుక రాజకీయ కోణాలతో పాటు పార్టీ పరంగా ముందుకు వెళ్లే అంశాలు ఉంటాయి. అమిత్ షా ఈ ఏడాది కాలంలో ఎన్నోసార్లు రెండు తెలుగు రాష్ట్రల్లో పర్యటించారు. అయితే ఈ భేటీ వెనుక జోరుగా ప్రచారం సాగుతున్నది. అవసరాలకు అనుగుణంగా జగన్ ను వాడుకుంటున్న బీజేపీ టీడీపీ తో పొత్తు దిశగా చర్చలు ఏమైనా ఉంటాయా అని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ సాగుతున్నది. తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగతుండగా, ఏపీలో మాత్రం అంతగా ప్రభావం ఇప్పటికైతే కనిపించడంలేదు. దీంతో పొత్తు బీజేపీకి తెలంగాణలో టీడీపీ మద్దతివ్వడం, ఏపీలో టీడీపీ కి బీజేపీ మద్దతివ్వాలనే అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే చంద్రబాబు ఓటుకు నోటు కేసు కూడా తెరపైకి తీసుకువచ్చి కేసీఆర్ కు చెక్ పెట్టే ఆలోచన కూడా ఉందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొద్ది రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడుతున్నాడు. తను కేంద్రంగా మూడో ఫ్రంట్ కు కేసీఆర్ అడుగులు వేస్తున్నాడు. దీనిపైనా చర్చించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తున్నది. అయితే అమిత్ షా భేటీ లో రాధాకృష్ణ చంద్రబాబు చెప్పినట్లుగా నడుచుకునే అవకాశాలు ఉంటాయని మీడియా, పొలిటికల్ సర్కిల్ టాక్. రాధాకృష్ణ, చంద్రబాబు శరీరాలు వేరైనా ఇద్దరి ఆత్మఒక్కటేనని అందరికీ తెలుసు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు ఏపీలో జగన్ ను, ఇటు తెలంగాణ లో కేసీఆర్ కు చెక్ పెట్టేలా రాధాకృష్ణ పలు అంశాలను ముందు పెట్టనున్నట్లు తెలుస్తున్నది.
కేంద్ర హోంమంత్రి, బీజేపీలో చాణక్యుడిగా పేరున్న అమిత్ షా టూర్ సెట్ అయ్యిందంటే దాని వెనుక రాజకీయ కోణాలతో పాటు పార్టీ పరంగా ముందుకు వెళ్లే అంశాలు ఉంటాయి. అమిత్ షా ఈ ఏడాది కాలంలో ఎన్నోసార్లు రెండు తెలుగు రాష్ట్రల్లో పర్యటించారు. అయితే ఈ భేటీ వెనుక జోరుగా ప్రచారం సాగుతున్నది. అవసరాలకు అనుగుణంగా జగన్ ను వాడుకుంటున్న బీజేపీ టీడీపీ తో పొత్తు దిశగా చర్చలు ఏమైనా ఉంటాయా అని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ సాగుతున్నది. తెలంగాణలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగతుండగా, ఏపీలో మాత్రం అంతగా ప్రభావం ఇప్పటికైతే కనిపించడంలేదు. దీంతో పొత్తు బీజేపీకి తెలంగాణలో టీడీపీ మద్దతివ్వడం, ఏపీలో టీడీపీ కి బీజేపీ మద్దతివ్వాలనే అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే చంద్రబాబు ఓటుకు నోటు కేసు కూడా తెరపైకి తీసుకువచ్చి కేసీఆర్ కు చెక్ పెట్టే ఆలోచన కూడా ఉందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొద్ది రోజులుగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడుతున్నాడు. తను కేంద్రంగా మూడో ఫ్రంట్ కు కేసీఆర్ అడుగులు వేస్తున్నాడు. దీనిపైనా చర్చించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తున్నది. అయితే అమిత్ షా భేటీ లో రాధాకృష్ణ చంద్రబాబు చెప్పినట్లుగా నడుచుకునే అవకాశాలు ఉంటాయని మీడియా, పొలిటికల్ సర్కిల్ టాక్. రాధాకృష్ణ, చంద్రబాబు శరీరాలు వేరైనా ఇద్దరి ఆత్మఒక్కటేనని అందరికీ తెలుసు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు ఏపీలో జగన్ ను, ఇటు తెలంగాణ లో కేసీఆర్ కు చెక్ పెట్టేలా రాధాకృష్ణ పలు అంశాలను ముందు పెట్టనున్నట్లు తెలుస్తున్నది.