ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య లో జనవరి 22 తారీఖున రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక అట్టహాసంగా జరగబోతోంది. ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ నిర్వహకులు డ్రోన్ షో ప్రాక్టీస్ ని నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ప్రపంచం అంతా అయోధ్య రామ మందిరం కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది..ఇప్పటికే రాముడి విగ్రహం అక్కడకు చేరుకుంది ఈ ఫోటోలు విడదల అయిన నేపద్యంలో భక్తులందరు చూసి తరించారు. తాజాగా అక్కడ నిర్వహించిన డ్రోన్ షో ఇప్పుుడు అందరిని ఆకట్టుకుంటుంది. మీరు ఆవీడియోను చూడండి.