ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ప్రస్టేజియస్ మూవీ లో ఆదిపురుష్ ఒకటి. ఈ మూవీపై ఓ రేంజ్ లో హైప్స్ ఉన్నాయి. రామయాణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. అయితే టీజర్ నుంచి పోస్టర్ల వరకు ఎదురుదెబ్బల తగలడంతో మేకర్స్… క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రిపేర్లు చేస్తున్నారు. ఈ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్లల్లో సీతారాములు, ఆంజనేయుడు చూపించిన తీరు కూడా అభ్యంతరకరంగా మారింది. దీనికి తోడు కోర్టు కేసులతో సతమతమవుతోన్న టీంకు అరుదైన ఘనత సాధించింది.
సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ట్రిబెకా ఫెస్టివల్లో ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించబోతున్నారు. న్యూయార్క్లో జరిగే ఈ ప్రఖ్యాత కళల ఉత్సవంలో జూన్ 13న ఆదిపురుష్ సినిమా ప్రదర్శితం కాబోతుంది. దీంతో ఆదిపురుష్ మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ కు మూడ్రోజుల ముందే సినీ ప్రియుల మనసు దోచుకోబోతుందని… ఇదే విషయాన్ని డైరెక్టర్ ఓం రౌత్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఇది గౌరవం, సంతోషానికి మించింది. ఆదిపురుష్ సినిమాను ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరి మెంబర్స్కు నా ధన్యవాదాలు… ఆ వేడుక కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నామంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ప్రభాస్ మూవీ రిలీజ్ ముందే అరుదైన గౌరవం సొంతం చేసుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.
ఇదిలా ఉంటే… విజువల్ ఫీస్ట్గా ఆదిపురుష్ 3డి ఫార్మాట్లో మిడ్నైట్ ఆఫరింగ్ గా ఈ ఫెస్టివల్లో ప్రదర్శించబడుతోంది. కాగా ఇది భారతీయ సినిమా అయిన ఆదిపురుష్ కి దక్కిన గొప్ప సదవకాశం అని అంటున్నాయి భారతీయ సినీ వర్గాలు. పైగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత అలాంటి ఘనత సాధిస్తున్న మూవీగా కొనియాడుతున్నారు. ఇక ఈ సినిమాను జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో షోలు వేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తుందట. ఇండియా మొత్తం మీద ఎనిమిది వేల థియేటర్లలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. రోజుకు సుమారు 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఇన్సైడ్ టాక్. ఇప్పుడు ఆదిపురుష్కు ఓం రౌత్ చేసిన రిపేర్లు జనాలను ఆకట్టుకుంటాయా? లేదా? అన్నది చూడాలి.