అల్లరి పిడుగు సితార ఘట్టమనేని అల్లరి గురించి పరిచయం అవసరం లేదు. సినిమాల్లోకి రాకపోయినా ఇన్ స్టా ట్విట్టర్ సహా సొంత యూట్యూబ్ చానెల్ తో ఇప్పటికే బోలెడంత ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అందుకే సితారకు సంబంధించిన ఏ చిన్న విషయం అయిన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తాజాగా సితారకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్పెషల్ గిఫ్ట్ తో సర్ప్రైజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సినిమాలతో పాటు బిజినెస్లోనూ దూసుకెళుతోంది. గర్భంతో ఉన్నప్పుడే ఎడ్-ఎ-మమ్మా అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించింది అలియా. 2 నుంచి 14 ఏళ్ల వయసున్న పిల్లలకు అవసరమైన దుస్తులను ఈ స్టార్టప్ కంపెనీ విక్రయిస్తోంది. ఆల్రెడీ ఎన్టీఆర్ తనయులిద్దరితో పాటు రామ్ చరణ్కు పుట్టబోయే బిడ్డకు బట్టలు పంపిన అలియా తాజాగా మహేశ్బాబు కూతురు సితారకు కూడా అదిరిపోయే అవుట్ ఫిట్ పంపింది. అలియా పంపిన దుస్తులు ధరించిన మహేశ్ కూతురు ఆ ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేయడంతో పాటు అదిరిపోయే కొటేషన్ ఇవ్వడంతో వైరల్ గా మారింది.
మీ ఫ్యామిలీలో నన్ను ఒకరిగా చేర్చుకున్నందుకు ధన్యవాదాలు.. మీరు పంపిన దుస్తులు నాకు ఎంతగానో నచ్చాయి` అని కామెంట్ చేసింది సితార పాప. అంతేకాదు అలియా పంపిన దుస్తులు ధరించి ఆ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. ఆ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లను రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరూ అలియా బిజినెస్ తెలివిని మెచ్చుకుంటున్నారు. ఇటు మహేష్ ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అయినట్టుగా తెలుస్తోంది.